Tuesday, February 22, 2011

Telangana 'Gladiators' outsmart police with Guerrilla warfare

Telangana 'Gladiators'  
outsmart police with Guerrilla warfare.

ఉస్మానియా విద్యార్దుల చలో అసెంబ్లీ వైపు , న్యాయవాదుల చలో రాజ్ భవన్ మరో వైపు హైదరాబాద్ ను రణరంగం ను తలపించాయి . విద్యార్దుల ,న్యాయవాదుల పోరాట ఎత్తుగడలు ఆకట్టుకున్నాయి  . దాదాపు 10,000 పోలీసులు నిన్నటి కార్యక్రమం కోసం 3అంచెల బందోబస్తు ఏర్పాటు చేస్తే , వాటిని పట్టా పంచులు చేసి అట్టు అసెంబ్లీ ని మరో వైపు రాజభవన్ ను ముట్టడించ గలిగారు . లాట్టి దెబ్బలకు , రబ్బెర్ బుల్లెట్లు , బష్వవయు గోలలు , అరెస్టు లు వారిని ఆపలేక పాయినాయి . పోలీసుల జులుము కు విద్యార్దులు న్యాయవాదులు మాత్రం బెదరలేదు . కానీ వీరి మొండి ధైర్యం ను చుసిన సీమంద్రులకు మాత్రం వెన్ను లు వణుకు పుట్టింది .

దాదాపు 20 మంది విద్యార్దులు , 10  మంది అమ్మాయిలు ముఖ్యమంత్రి ప్రవేశించే గేటు # 1 వద్ద కు చేరి " జై తెలంగాణా " అని నినాదాలు చేస్తూ ధర్నా కు దిగి  తమ సత్తా చాటారు . గేటు # 1,  VVIP జోన్  కిందికి వస్తుంది . ఇక్కడ సెక్యూరిటీ పకడ్బందిగ వుంటది , అలంటి VVIP జోన్ కు చేరి ధర్నా కు దిగడం తో పోలీసులు , అధికారులు దిగ్రంతి కి లోనైనారు 

"చలో" కార్యక్రమాని ఎలాగయినా విఫలం చేయాలనీ సీమంధ్ర  పోలీసులు 3 అంచెల వ్యూహం రచించినారు . కానీ గెరిల్ల యుద్దనీతి తో విద్యార్దులు , న్యాయవాదులు పోలీసులకు చుక్కలు చూపించినారు . బారికేడ్ ను బద్దలు కొట్టి అసెంబ్లీ లోనికి విద్యార్దులు చొచ్చుకొని పోఇంద్రు  . మరో పక్క రాజ్ భవన్ ముట్టడి తో న్యాయవాదులు పోలీసులను పరుగులు పెట్టించిండ్రు .

పోలీసుల అతి ప్రవర్తన తో ఉస్మానియా మరో సరి బగ్గుమన్నది , శాంతియుతంగా  వస్తున్నా వారి ఫై జులుం చేస్తూ లాట్టిలకు పని చెప్పిండ్రు . దీంతో విద్యార్దులు రాళ్ల వర్షం కురిపించారు  . కేవలం 600 మంది మాత్రమే ఉన్న విద్యార్దుల ఫై దాదాపు 250 బాష్పవాయువు గోలలు పెల్చిండ్రు , తుపాకుల తో కాల్పులు జరిపిండ్రు . ఏంటో మంది కాల్పులో తీవ్రంగా గాయపడ్డారు . దీంతో విద్యార్దులు గుంపులుగా విడిపోయి అసెంబ్లీ వైపు కదిలిండ్రు . విద్యార్దుల తెగువ మరీయు యుద్ద నీటి చుసిన ఒక IPS ఆఫీసర్ తెగ మేచుకున్నాడు , ఒక ఆంగ్ల పత్రిక తో మాట్లాడుతూ  " నాకు వీరి గెరిల్ల యుద్దనీతి ( Guerrilla warfare) చూస్తూ వుంటే గ్లడీఎటర్ (Gladiator)  సినిమా గుర్తుకు వస్తుంది " అని కితాబ్ ఇచ్చిండు

ఇక న్యాయవాదులను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఒక్కో మార్గం గుండా ఒక్కో గుంపు రాజ్ భవన్ ముట్టడికి యత్నించింది . పోలీసుల అంచనాలను తలకింద చేస్తూ లోకల్ రైల్ ఎక్కి మక్త రైల్ గేటు దగ్గర చైను లాగి రాజ్ భవన్ గేటు ముందు ప్రత్యక్షం అయిండ్రు . మరి కొంత మంది తమ నల్లని కోట్లను సంచి లో పెట్టుకొని సాదారణ ప్రయాణికుల వచ్చి పోలీసులను బోల్త కొట్టిచిండ్రు . వీరి సాహసాని తెల్సుకున్న హిట్లేర్ (Hitler) సమానుడైన రాష్ట్ర గవర్నర్ కలవరం మొదలైంది  అందుకే వెంటనే న్యాయవాదులను చర్చలకు పిలిచిండు . మొత్తానికి పోలీసులు ఎంత జులుం చేసిన ,కుట్రలు పన్నిన తెలంగాణావాదులు తము తల పెట్టిన కార్యాన్ని  దిగ్విజయంగా ముగించారు .



No comments: